టాలీవుడ్ యాక్టర్ నితిన్ తాజాగా ఆంజనేయస్వామి భక్తుడిగా మారిపోయాడు. కాషాయం వస్త్రాలు, ఆంజనేయస్వామి మాల ధరించిన ఉన్న ఫోటోని తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. దీక్ష వలన తాను చాలా శాంతంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. ఉదయాన్నే 5 గంటలకి లేచిన తనకి శ్రీ ఆంజనేయం సాంగ్స్ తో డే స్టార్ట్ అవుతుందని అన్నాడు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలతో బిజీ కానున్నట్టు స్పష్టం చేశాడు. ఆధ్యాత్మికతతో కూడిన వైబ్స్ తనకు సరికొత్త ఉత్సాహం ఇస్తుందని నితిన్ తన ట్వీట్లో తెలిపాడు. ఇప్పుడు ఆ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది..
It feels so blessed and very peaceful being in Lord Hanuman Deeksha🙏🏻. Wakin up at 5 AM and startin my day with beautiful Sree Anjaneyam songs followed by poojas.All these Divine Vibes are so spiritual refreshing. Sree anjaneyam🙏🙏#FeelsAwesome #Rejuvenating #JaiHanuman pic.twitter.com/lMuN3PpSe3
— nithiin (@actor_nithiin) February 21, 2019
సినిమాల విషయానికి వస్తే.. త్వరలో భీష్మ చిత్రంతో నటించబోతున్నాడు నితిన్. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశ పరిచాయి. కాగా, భీష్మ చిత్రంతో తిరిగి పుంజుకోవాలని నితిన్ భావిస్తున్నాడు.