ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడి తర్వాత పాకిస్థాన్ భారత్పై విషం చిమ్ముతోంది. సరిహద్దులో పోరాడటం చేతకాక భారత్ సినిమాలపై నిషేధం విధించి వక్ర బుద్ధిని పాక్ బయటపెట్టింది. సర్జికల్ దాడి జరిగిన క్రమం నుండి ఆ దేశ బ్రాడ్-క్యాస్టింగ్ మంత్రి ఫవాద్ హుసేన్ భారత్ పై నిప్పులు కక్కుతున్నారు మొన్న కాశ్మీర్ ఎప్పటికీ భారత్ ది కాదు ఇక పై కూడా కాశ్మీర్ భారత్ ది అవ్వడు అంటూ ట్వీట్ చేశారు. నేడు మళ్ళీ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా భారత్ పై న్నిపూలు చెరగాలని చూశాడు. భారత్ సినిమాల పై యాడ్స్ పై నిషేదం ప్రకటించాడు.‘భారత కంటెంట్ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. పాకిస్థాన్లో భారత్ సినిమాలు విడుదలవ్వవు. అలాగే మేడిన్ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA)కి ’అంటూ ఫవాద్ ట్వీట్ చేశారు.
Cinema Exhibitors Association has boycotted Indian content, no Indian Movie ll be released in Pakistan. Also have instructed PEMRA to act against Made in India Advertisements. #PakistanTayarHai https://t.co/9BPo6LIsVB
— Ch Fawad Hussain (@fawadchaudhry) February 26, 2019