వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో చంద్రబాబు కి సంభందం ఉండతూ నిన్నటి నుండి నాన్స్టాప్ గా ట్వీట్లు చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి. నిన్న మీడియ ముందుకు వచ్చిన విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు లోకేష్ అది నారాయణ రెడ్డి లకి ఈ హత్య తో సంబంధం ఉందని అనడం తెలిసిందే ఇక అప్పటి నుండి ఆయన దొరికిన వేధికనల్లా వాడుకుంటున్నారు అది ట్విట్టర్ ఏ కానీ లేక మీడియా అయినా కానీ విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు పై ఆరోపణల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
“ కడప జిల్లాలో అధికార పార్టీకి వివేకా హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చున్నారన్నారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప.. కడపలో పట్టు దొరకదని.. ఇలా అమానవీయంగా హతమార్చారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ లే కుట్రకు బాధ్యలు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు” . ఈ మేరకు ట్వీట్ చేశారు.
జగన్ గారిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణంగా నరికి చంపారు.కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డునిల్చారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారు. చంద్రబాబు, లోకేశ్ లే కుట్రకు బాధ్యులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2019
ఇక మరో ట్వీట్ లో.. ‘‘రాజారెడ్డి గారి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి. హత్యాయత్నంలో జగన్ గారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానంద గారిని బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?’’ అని ఆరోపించారు.
రాజారెడ్డి గారి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి.హత్యాయత్నంలో జగన్ గారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానంద గారిని బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2019
మరో ట్వీట్ లో ‘‘అరకు ఎమ్మెల్యే కిడారి హత్య జరిగినపుడు ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారని అప్పటి విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సస్పెండ్ చేశారు. సస్సెన్షన్ ఎత్తివేసి ఆయనను ఇటీవలే కడప ఎస్పీగా నియమించారు. ఇదంతా ఒక భారీ కుట్ర అనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?’’ అని ఆయన ట్వీట్ చేశారు.. ఇలా గడిచిన ఆరుగంటల్లో 3 ట్వీట్లు చేశారు.
అరకు ఎమ్మెల్యే కిడారి హత్య జరిగినపుడు ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారని అప్పటి విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సస్పెండ్ చేశారు. సస్సెన్షన్ ఎత్తివేసి ఆయనను ఇటీవలే కడప ఎస్పీగా నియమించారు. ఇదంతా ఒక భారీ కుట్ర అనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2019