నాకు అత్యంత ఆప్తుడయిన జయదేవ్ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
జయదేవ్తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా జయదేవ్ కు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొన్న తారక్ కు చేతికి చిన్న గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు.
ఆయన ఇక లేరు అంటూ కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్
Share.